ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు, సేవలు, వసతి గదుల విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 16, 2023, 07:12 PM

తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తుల సౌక‌ర్యార్థం 2024 మార్చి నెల‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ ద‌ర్శ‌నం, ఆర్జిత సేవా టికెట్ల కోటా షెడ్యూల్ విడుదలైంది. శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల‌ ల‌క్కీడిప్ కోసం డిసెంబ‌రు 18వ తేదీ ఉద‌యం 10 నుండి 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు న‌మోదు చేసుకోవ‌చ్చు. శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల కోటాను డిసెంబ‌రు 21వ తేదీ ఉద‌యం 10 గంట‌లకు విడుద‌ల చేస్తారు. శ్రీ‌వారి తెప్పోత్స‌వాల టికెట్లను డిసెంబ‌రు 21వ తేదీ ఉద‌యం 10 గంట‌లకు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.


శ్రీ‌వారి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్లు, ద‌ర్శ‌న టికెట్ల‌ కోటాను డిసెంబ‌రు 21న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుద‌ల చేస్తారు. అంగ‌ప్ర‌ద‌క్షిణం టోకెన్లు డిసెంబ‌రు 23న‌ ఉద‌యం 10 గంట‌లకు అందుబాటులో ఉంటాయి. శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల ద‌ర్శ‌నం, గ‌దుల కోటాను డిసెంబ‌రు 23న ఉద‌యం 11 గంట‌లకు విడుద‌ల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగుల ద‌ర్శ‌న‌టికెట్ల కోటాను డిసెంబ‌రు 23న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు విడుద‌ల చేస్తారు. రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న ట‌కెట్ల‌ను డిసెంబ‌రు 25న ఉద‌యం 10 గంట‌లకు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు. డిసెంబ‌రు 27న ఉద‌యం 11 గంట‌లకు.. తిరుమ‌ల‌, తిరుప‌తిలోని శ్రీ‌వారి సేవ కోటాను, అదేరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ కోటాను, మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది.


డిసెంబరు 17 నుండి తిరుమ‌ల‌లో తిరుప్పావై పారాయ‌ణం


తిరుమల, 2023 డిసెంబరు 16పవిత్ర ధనుర్మాసం సంద‌ర్భంగా డిసెంబరు 17న ఆదివారం నుండి 2024 జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్‌ స్వామి మ‌ఠంలో ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావై పాశురాల‌ను పారాయ‌ణం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అదేవిధంగా తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో హైద‌రాబాదుకు చెందిన వేదాంత విద్వాంసులు డా. గోవ‌ర్ధ‌నం స్వామినాథాచార్యులు నెల రోజుల పాటు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావై ప్ర‌వ‌చ‌నాలు చేస్తారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ఘ‌డియ‌లు డిసెంబ‌రు 17వ తేదీ తెల్లవారుజామున 12.34 గంటలకు ప్రారంభమ‌వుతాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2024 జనవరి 14న ముగియనున్నాయి. అప్ప‌టివ‌ర‌కు సుప్ర‌భాతం సేవ ఉండ‌దు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని టీటీడీ సూచించింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa