ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ఇప్పటికే నాగబాబు ఓటు హక్కు,,,ఏపీలో దరఖాస్తు చేసుకోవడంపై వైసీపీ ఆరోపణలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 16, 2023, 07:17 PM

జనసేన పార్టీ నేత కొణిదెల నాగబాబు వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణలో ఓటు ఉన్న ఆయన.. ఏపీలో కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగబాబు, ఆయన భార్య, కుమారుడు ఓటు హక్కు వినియోగించుకున్నారన్నది వైఎస్సార్‌సీపీ ఆరోపణ. ఇప్పుడు కొత్త ఓటు కోసం ఏపీలోనూ దరఖాస్తు చేసుకున్నారని చెబుతున్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌-168లో కొణిదెల నాగబాబు (సీరియల్‌ నెంబర్‌-323), కొణిదల పద్మజ(సీరియల్‌నెంబర్‌- 324), సాయి వరుణ్‌ తేజ్‌(సీరియల్‌ నెంబర్‌-325) ఓటు వేశారని చెబుతోంది వైఎస్సార్‌సీపీ. తాజాగా ఏపీలోని మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకున్నారని కొన్ని ఆధారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నాగేంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో నాగేంద్రరావుగా ఓటు వేయగా.. ఇక్కడ నాగేంద్రబాబుగా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.


'తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్‌బూత్-168లో ఫ్యామిలీతో కలిసి నాగబాబు ఓటు వేశాడు. కానీ ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో ఓటు కోసం నాగబాబు దరఖాస్తు చేసుకున్నాడు. తెలంగాణలో నాగేంద్ర రావు పేరుతో ఓటు వేసి.. ఇక్కడ నాగేంద్ర బాబు పేరుతో అతను దరఖాస్తు చేసుకోవడం గమనార్హం' అంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్న సజ్జల భార్గవ్ రెడ్డి కూడా ఈ అంశంపై ట్వీట్ చేశారు. 'కొణిదెల నాగేంద్ర రావు అలియాస్ కొణిదెల నాగబాబు చేసిన ఘనకార్యం. ఏం ప్యాకేజ్, మ్యారేజ్ స్టార్? నీతులు పక్కన వాళ్లకు చెప్పడమేనా తమరు పాటించడం ఏం లేదా?'అంటూ ఘాటుగా స్పందించారు.


సజ్జల భార్గవ్‌కు ఓ నెటిజన్ కౌంటర్ ఇచ్చారు.'175 సీట్లు గెలుస్తామంటున్న భార్గవ్ గారు మీరు ఎందుకు కేవలం నోటా పార్టీ అని అంటున్న జనసేన దగ్గర భయపడుతున్నారు. నాగబాబు కుటుంబం హైదరాబాదులో ఓటు వేస్తే దాని ఫోటోలు కూడా పెట్టండి లేదంటే మీరు మిమ్మల్ని అర్థం చేసుకోండి' అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు నాగబాబు ఈ రెండు ఓట్ల వివాదంపై జనసేన పార్టీ స్పందించాల్సి ఉంది. అయితే నాగబాబు కుటుంబం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదని కొందరు చెబుతున్నారు. అయితే తెలంగాణలో ఓటును రద్దు చేసుకుని.. ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారా.. అక్కడ ఓటు ఉండగానే ఇక్కడు ఓటు కోసం అప్లై చేసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ అంశాలపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa