న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ILBS) తొమ్మిదో స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి సమర్థత, సమగ్రతతో కేవలం 13 ఏళ్ల వ్యవధిలో ఐఎల్బిఎస్ తన సముచిత స్థానాన్ని ఏర్పరచుకుందని అన్నారు. ఐఎల్బిఎస్లో 1000కి పైగా కాలేయ మార్పిడి, సుమారు 300 మూత్రపిండ మార్పిడి జరిగాయని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సాపేక్షంగా తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలను అందించడం ద్వారా ILBS వంటి సంస్థల బలంతో భారతదేశం అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా మారుతోందని ఆమె పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్, ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల అనుసంధానంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని రాష్ట్రపతి అన్నారు. ఐఎల్బిఎస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ యూనిట్ స్థాపనను ఆమె సమయానుకూల చొరవగా అభివర్ణించారు. చికిత్స అందించడంతో పాటు పరిశోధనా రంగంలో ఐఎల్బిఎస్ను కొనసాగించాలని ఆమె కోరారు. నివారణ ఆరోగ్య సంరక్షణపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa