వైసీపి చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ..... గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని మన కళ్ల ముందు పెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. గడప గడపకు ప్రజాపాలనను దరి చేర్చారు. పేద, బడుగు, బలహీనవర్గాలు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుకునేలా చేయడం ద్వారా ..వారి ఆర్థిక,సామాజిక స్థాయిని పెంచారు జగనన్న. గ్రవర్ణాలతో సమానంగా అణగారిన వర్గాలు ఎదిగేందుకు.. సామాజిక న్యాయం లక్ష్యంగా ఎన్నో అవకాశాలు..బడుగు, బలహీనవర్గాలు పేదరికం నుంచి బయటపడేందుకు ఎన్నో సంక్షేమపథకాలు..జగనన్న సమర్ధపాలనకు నిదర్శనాలు. తెలుగుదేశం పార్టీకి మైనార్టీలు,బీసీ,ఎస్సీ,ఎస్టీలు ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొస్తారు. ఆయా వర్గాల ప్రజలను ఓటు బ్యాంకుగానే వాడుకుని, వదిలేసే రకం చంద్రబాబు. ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. నంద్యాలలో మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకున్నవారు టీడీపీ వారు. ఈరోజు నంద్యాలలో మెడికల్ కాలేజీ వచ్చింది. 150మంది విద్యార్థులు చదువుకుంటారు. నంద్యాల జిల్లా అయింది. అనేక ప్రభుత్వకార్యాలయాలు నూతన భవనాలతో కళకళలాడుతున్నాయి అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa