ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్మికులకు న్యాయం చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 31, 2023, 01:55 PM

కరోనాలో ప్రాణాలకు తెగించి పని చేసిన కార్మికుల పట్ల జగన్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారని రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కార్మికులకు కనీసం రక్షణ పరికరాలు కూడా ఇవ్వకుండా వేధించారని అన్నారు. స్కానింగ్ మెషీన్లు ఇచ్చి అదనపు పని భారాన్ని మోపారని ఆయన ఆరోపించారు. పట్టణాల్లో తగినంత సిబ్బందిని నియమించకుండా పని ఒత్తిడి పెంచి వేధిస్తున్నారని సత్యప్రసాద్ విమర్శించారు. కార్మికులకు శ్రమకు తగిన వేతనం ఇవ్వకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. జగన్ రెడ్డి కుళ్లిన సర్కారును పారిశుధ్య కార్మికులే రానున్న ఎన్నికల్లో ఊడ్చి చెత్తకుప్పలో పడేస్తారని ఆయన అన్నారు. విషపూరిత మలినాల మధ్య ఉండే కార్మికులకు కనీసం హెల్త్ అలవెన్సులు కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమని అనగాని సత్యప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa