ఉమ్మడి గుంటూరు జిల్లా, తాడికొండలో వైసీపీ బస్సు యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ... ‘‘తాడికొండ సమన్వయకర్తగా నన్ను సంప్రదించకుండా ప్రకటించారు. పార్టీ ఆదేశాలు దిక్కరించకుండా నియోజకవర్గంలోకి వెళ్లను. వారం రోజులకే సర్వేలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆగిపోమన్నారు. మరల కొద్ది కాలం తర్వాత తాడికొండ నుంచి నువ్వే పోటీ చేయాలని చెప్పారు. తాడేపల్లి పెద్దలతో సహా సీఎం జగన్రెడ్డి స్వయంగా తనతో చెప్పారు. తీరా సుచరితను తాడికొండ ఇన్చార్జ్గా నియమించారు.ఎవరైనా జగన్రెడ్డి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సిందే. జగన్ను చూసే అవకాశం కల్పించాలి’’ అని పార్టీ నేతలను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa