ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పాలనలో అభివృద్ధి అనేది భూతద్దంలో వెతికినా కనిపించదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2024, 03:49 PM

జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా రేపటి (బుధవారం) నుంచి "రా కదలి రా!" పేరిట కార్యక్రమాలకు టీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం - జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కృతమైంది. మంగళవారం సైకిల్ - గాజు గ్లాసుతో కూడిన లోగోను పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఎన్టీఆర్ ఇచ్చిన ‘‘రా కదలిరా’’ పిలుపునే మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప జగన్ పాలనలో అభివృద్ధి అనేది భూతద్దంలో వెతికినా కనిపించదని విమర్శించారు. రాష్ట్రాన్ని చీకటిమయం చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆందోళనప్రదేశ్‌గా మార్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. స్వర్ణయుగం తెలుగుదేశంతోనే సాధ్యమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపారు. అన్ని సభలు తెలుగుదేశం - జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు.  చంద్రబాబు - పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనే సభలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa