ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటర్ల జాబితాపై ఇంత నిర్లక్ష్యమా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 04:47 PM

దొంగ, బోగస్ ఓట్లపై చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆమరణ నిరహార దీక్షకు పూనుకున్నారు. ఈక్రమంలోనే ఆయన ఓ సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆర్డీవో స్పందించి బోగస్ ఓట్లు ఏరివేసేంత వరకూ దీక్ష విరమించకూడదని పులివర్తి నాని నిర్ణయం తీసుకున్నారు. ఓటర్ల జాబితాపై ఇంత నిర్లక్ష్యమా..? అని పులివర్తి నాని ప్రశ్నించారు. బోగస్ ఓట్ల నమోదుకు సహకరిస్తున్న కొందరు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 7నెలలుగా పోరాడుతున్నా పట్టించుకోకపోవడం ఏమిటని పులివర్తి నాని మండిపడ్డారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచనలతో భారీగా బోగస్ ఓట్లు నమోదు అవుతున్నాయన్నారు. అధికారులు ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలని కోరారు. ఆధారాలు సమర్పించి చర్యలు తీసుకోండి మహాప్రభో అంటున్న స్పందన కరువైందన్నారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దొంగ ఓట్లు సృష్టించారని పులివర్తి నాని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa