వైసీపీ ఆదేశాలతో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాక్షస రాజులు కూడా సైకో జగన్లాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడలేదన్నారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకలగురిలో వైసీపీ జెండాను కాల్చేశారనే ఆరోపణలపై టీడీపీ కార్యకర్త, బీసీ బోయ సామాజికవర్గానికి చెందిన చంద్రమోహన్ను అరెస్టు చేసిన పోలీసులు.. నగ్నంగా కొడుతూ ఊరేగించిన ఘోరం చూశాక తన గుండె చెదిరిపోయిందన్నారు.‘‘సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన మీరు ప్రజాధనం జీతంగా తీసుకునే పోలీసులా ?.. ఫ్యాక్షనిస్టు జగన్ కిరాయి సైన్యమా? ఒక కరడుగట్టిన నేరగాడు పెట్టిన పార్టీ జెండా అంత పవిత్రమైనదా!. జాతీయ జెండా పెడతామనడం నేరమా?’’ అని నిలదీశారు. టీడీపీ సైనికుడు చంద్రమోహన్ను నగ్నంగా ఊరేగించారని, పక్కటెముకలు విరగ్గొట్టారని అన్నారు. నరరూప రాక్షస చర్యలకు చట్టబద్ధమైన శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలని లోకేష్ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa