రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి అద్భుత విజయం సాధించబోతోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రస్తుతం 135 స్థానాల్లో కూటమి గెలవబోతోందన్న ఆయన షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఆ సంఖ్య 155కు పెరిగే అవకాశం ఉందన్నారు. చాలామంది కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందన్న ఆయన.. షర్మిల, ఆమె భర్త ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తారని చెప్పారు. ‘‘ వైసీపీ నేతలు 99 శాతం పనులు చేశామని చెప్తున్నారు. కానీ అవి చేసిన పనుల గురించి కావు. చేయని పనుల గురించి. వారి మోసాన్ని ప్రజలు గ్రహించారు’’ అని అన్నారు. జగన్ స్వయంకృతాపరాధం వల్లే ఆ పార్టీ ఓడిపోబోతున్నదని ఆయన జోస్యం చెప్పారు. కేంద్ర పథకాలకు వారి స్టిక్కర్లు పెట్టుకుని బటన్ నొక్కుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. తాను జగన్కు సహాయం చేశాను గానీ, ఆయన నుంచి ఎప్పుడు సహాయం తీసుకోలేదన్నారు. అందరి దగ్గరి నుంచి జగన్ కు తీసుకోవడమే తెలుసని, ఇవ్వడం తెలీదని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa