విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమానాలు రద్దుకావడంతో పండగ పూట గమ్యస్థానానికి చేరుకోలేక పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి వాతావరణం అనుకూలించక విశాఖకు రావల్సిన కొన్ని సర్వీసులను రద్దు చేయగా... మరికొన్నింటిని వేరేచోటుకు మళ్లించారు. విశాఖ- ఢిల్లీ ఇండిగో, ఎయిర్ ఇండియా, విజయవాడ- ముంబయి, హైదరాబాద్, చెన్నై ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి.
దీంతో విశాఖ విమానాశ్రయంలో గందరగోళం నెలకుంది. ఎయిర్ ఇండియా, ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ప్రయాణికులు.. ఆందోళన చేస్తున్నారు. గంటల కొద్దీ సమయం ఎయిర్ పోర్ట్ లో వేచి చూడాల్సి రావడం, తరువాత విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండగ వేళ గమ్యస్థానానికి చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి వాతావరణం అనుకూలించక పోవడంతో విశాఖ రావలసిన సర్వీసులు రద్దు చేసినట్లు తెలుస్తోంది.
రద్దయిన విమానం వివరాలు.. AI486 విశాఖపట్నం-పోర్ట్బ్లెయిర్- న్యూఢిల్లీ, 6E 5247/5248 విశాఖపట్నం- ముంబయి- విశాఖ ఇండిగో విమానం, ఎయిరిండియా AI 451/452 న్యూఢిల్లీ-విశాఖపట్నం- న్యూఢిల్లీ, 6E917/6E6089 చెన్నై- విశాఖ-చెన్నై విమానం, తిరుపతి-విశాఖ- విజయవాడ ఇండిగో విమానం, 5176/2776 ఢిల్లీ-విశాఖపట్నం-ఢిల్లీ విమానం రద్దయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa