రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, సీఎంగా జగనమోహనరెడ్డికి ఇదే ఆఖరి సంక్రాంతి అని జెడ్పీ మాజీ చైర్మన, టీడీపీ పార్లమెంటరీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం తెలిపారు. సుండుపల్లె మండలంలోని బలిజపల్లెలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన తాడు లాడుగు పోటీలకు ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పోటీలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి రోజులు చెల్లిపోయాయని, ప్రజలు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అరాచకాలు, అక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఈ సంక్రాంతిలతో రాష్ట్రం నుంచి వెలివేయాలన్నారు. జగన పాలనలో కాపులకు తీరని అన్యాయం జరిగిందని, రానున్న ఎన్నికల్లో మన సత్తా ఏంటో నిరూపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుబు రెడ్డెప్ప, రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి శివకుమార్నాయుడు, దామోవర్నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు చిట్టెం రామచంద్ర, ప్రతాప్రెడ్డి, చెన్నంశెట్టి వెంకట్రమణ, రామాంజులు, మేకల మహబూబ్ బాషా, యర్రంరెడ్డి, చానబాషా, రామయ్య, మాజీ ఎంపీటీసీ మోహన, పోకల సిద్దయ్య, మునిస్వామి, జనసేన మండల నాయకులు రామశ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa