ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రక్తమోడిన రహదారి.. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2024, 09:32 PM

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. దువ్వాడ వద్ద జరిగిన ప్రమాదంలో ఎనిమిదేళ్ల చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం చెందారు. అలాగే, అనకాపల్లి వద్ద జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దువ్వాడ వద్ద స్కూటీని.. ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న టిప్పర్ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ఎనిమిదేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతిచెందారు.


అనకాపల్లి జిల్లాలో వేగంగా వేళ్తోన్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తోన్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా.. మరికొందరు గాయపడ్డారు. ప్రమాద సమయానికి ఆ కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. గాయపడినవారిని చికిత్స కోసం అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం వైజాగ్ కేజీహెచ్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించేలోపే క్షతగాత్రులు చనిపోయారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై వాహనాలు బారులు తీరి ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో తక్షణమే ట్రాఫిక్‌ను క్లియర్ చేసిన పోలీసులు.. వాహనాలను నియంత్రించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa