ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ రావాలి.. సాక్ష్యం చెప్పాలి: కోడికత్తి శ్రీను జైల్లో ఆమరణ దీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2024, 09:55 PM

గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్‌పై కోడికత్తితో హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్ విశాఖ సెంట్రల్ జైల్లో ఆమరణ దీక్షకు కూర్చున్నారు. అతడి దీక్షకు విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా కోడికత్తి శ్రీనుతో దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు బూసి వెంకట్రావు ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జలపల్లి శ్రీనివాస్ ఈ ఉదయం అల్పాహారం కూడా తీసుకోలేదని, తన దీక్షకు భగ్నం కలగకుండా కావలసిన అనుమతులు ఇప్పించాలని కోరుతున్నాడని చెప్పారు.


గత ఐదేళ్లుగా ప్రయత్నాలు చేసినా కరగని ముఖ్యమంత్రి మనసు, కనీసం ఈ ప్రయత్నంతోనైనా కరుగుతుందని భావిస్తున్నాడని అన్నారు. పోలీసులు అనుమతులు నిరాకరించడంతో కోడి కత్తి శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు విజయవాడలోని తమ ఇంట్లోనే దీక్షకు దిగారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని, నా ప్రాణాలు పోయినా తన కుమారుడి కోసం.. న్యాయం కోసమే నా ఆమరణ దీక్ష ఆగదని శ్రీను తల్లి ఉద్ఘాటించారు. జనవరి 12న విజయవాడ ధర్నా చౌక్‌లో దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు.


జైల్లో తన కొడుకు శ్రీను,ఇంట్లో నేను, నా పెద్ద కుమారుడు నిరాహార దీక్ష చేస్తున్నామని అన్నారు. పోలీసు అనుమతులు లేని కారణంగా ఇంట్లోనే దీక్ష చేస్తున్నామని, సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. శ్రీను ప్రాణం ఉన్న అంబేడ్కర్ వారసుడ్ని జైల్లో పెట్టించిన జగన్.. ప్రాణం లేని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం దళితులకు చేస్తున్న ద్రోహమని కోడి కత్తి శ్రీను సోదరుడు సుబ్బరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో కొలువైన కనక దుర్గమ్మ, గుణదల మేరీమాత మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa