ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళితుల పథకాల్ని రద్దు చేసింది సీఎం జగన్ కాదా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 20, 2024, 01:59 PM

దళితుల అభ్యు న్నతికి గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన షుమారు 28 సంక్షేమ పథకాలను రద్దు చేసి వారికి తీవ్ర అన్యాయం చేసి, అంబేడ్కర్‌ విగ్రహం పేరుతో మరోసారి దళితులకు గాలం వేస్తున్న సైకో జగన్‌ను దళితులు నమ్మ రని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం పోరంకి బీజేఆర్‌ నగర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి జగన్‌ దళితులను ఏవిధంగా మోసం చేస్తున్నదీ వినతిపత్రం రూపంలో ఆయనకు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ, ఐదేళ్ల వైసీపీ పాలనలో షుమారు 188 మంది దళితులు హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మా స్కులు అడిగారని దళిత డాక్టర్‌ను, మాస్కు పెట్టుకోనందుకు కిరణ్‌ అనే యువకుడిని దారుణంగా కొట్టి చంపిన విషయం రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తుందన్నారు. వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్సీ దళితుడైన తన కారు డ్రైవరును హత్య చేసి ఇంటికి పార్సిల్‌ పంపిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. తాను ఎమ్మె ల్యేగా ఉన్నప్పుడు ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో వణుకూరు, ముదునూరు, కాటూరు, కలువపాముల తదితర గ్రామాల ఎస్సీ కాలనీల్లో వసతుల మెరుగుకు కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఐదేళ్ల కిందట తాను ముఖ్యమంత్రి కావడానికి సాయపడిన దళితుడు కోడికత్తి శ్రీనుకు బెయిల్‌ వచ్చేందుకు కనీసం సహకరించకపోవడం జగన్‌ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు అనుమోలు ప్రభాకరరావు, సంగెపు రంగారావు, మారుపూడి ధన కోటేశ్వరరావు, పీతా గోపీచంద్‌, పులి విజయ్‌, మహేష్‌, వేమూరి ప్రసాద్‌, నందేటి సూర్య, వినుకొండ రాజా, ఇడుపులపాటి రవిచంద్ర, బండ్రపల్లి శ్రీకాంత్‌, జడ శ్రీను, పిల్లజెట్టి సీమోను, పరిమి ఏసో బు, నందిపాముల రాజశేఖర్‌, చిలుకూరి రాబర్ట్‌, మ ల్లాది రత్నగిరి, బండ్రపల్లి సుబ్బారావు, కొమరపల్లి సు గుణరావు, పరిమి విల్సన్‌, ఏసురత్నం పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa