ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ అలజడి

national |  Suryaa Desk  | Published : Mon, Dec 24, 2018, 01:39 PM

న్యూఢిల్లీ: నాలుగు రోజులుగా పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలకు దిగుతుండడంతో జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ అలజడి మొదలైంది. రాజౌరి జిల్లా నౌషెరా ప్రాంతంలో నియంత్రణ రేఖ పొడవునా పాక్ రేంజర్లు ఇవాళ కాల్పులకు తెగబడ్డారు. నాలుగురోజుల్లోనే పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది మూడోసారి. ప్రత్యేకించి సరిహద్దును ఆనుకుని ఉన్న సైనిక పోస్టులు, జనావాసాలే లక్ష్యంగా పాకిస్తాన్ కాల్పులకు దిగుతోంది. కాగా ఇవాళ జరిగిన కాల్పుల్లో ఏమైనా ప్రాణనష్టం జరిగిందా అన్నదానిపై ఇంకా సమాచారం లేదు. ఆదివారం పూంచ్ జిల్లా కర్మారా ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్.. మరుసటి రోజే మళ్లీ కాల్పులకు తెగబడడం గమనార్హం. ఈ నెల 21న కుప్వారాలోని కెరాన్ సెక్టార్‌లో పాక్ సైనిక మూకలు కాల్పులకు దిగడంతో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa