సంసారం అంటే జోడెద్దుల బండిలాందని పెద్దలు చెప్తుంటారు. కాడెద్దులు సక్రమంగా అడుగేస్తే బండి ఎలా ముందుకు సాగుతుందో.. భార్యాభర్తలు ఇద్దరూ ఒద్దికగా కలిసి నడిస్తేనే కాపురం అలా సాగుతుందని పెద్దలు చెప్పే మాట. కానీ ప్రస్తుతం సమాజంలో ఈ పోకడ మారిపోయింది. భర్త చట్నీ బాగాలేదని తిట్టాడని భార్య.. భార్య అలిగి పుట్టింటికి పోయిందని భర్త.. ఇలా బలహీన క్షణంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే ఒకరిపై ఒకరికి అపనమ్మకం కూడా తీవ్రమైన ఘటనలకు కారణమవుతోంది. అలాంటి ఘటనే వైఎస్ఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. నిద్రపోతున్న భర్త మీద భార్య సలసలా కాగుతున్న వేడి నూనె పోసిన ఘటన కడపలోని బెల్లంమండి ప్రాంతంలో చోటుచేసుకుంది. భర్త మీద అనుమానం పెంచుకున్న ఓ ఇల్లాలు కోపంతో నిద్రపోతున్న భర్తమీద వేడినూనె పోసింది. అంతటితో ఊరుకోకుండా కూతురికి బలవంతంగా నిద్రమాత్రలు మింగించింది. ఆ తర్వాత తాను కూడా అవే మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనుమానంతో ఆ కుటుంబం చేసిన పని స్థానికంగా కలకలం రేపింది.
బెల్లంమండి వీధికి చెందిన మహేష్ అనే వ్యక్తి సెల్ఫోన్ దుకాణం పెట్టుకుని బతుకుతున్నాడు. మహేష్కు ముగ్గురు పిల్లలు సంతానం. చక్కగా సాగిపోతున్న కాపురంలో ఇటీవల విభేధాలు మొదలయ్యాయి. మహేష్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని అతని భార్య జ్యోతికి అనుమానం మొదలైంది. రానురానూ ఆ అనుమానం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి నిద్రపోతున్న మహేష్ మీద జ్యోతి వేడి నూనె పోసింది. ఊహించని పరిణామంతో మహేష్ బిత్తరపోయాడు, బాధతో విలవిల్లాడిపోయాడు. అంతటితో ఊరుకోని జ్యోతి కూతురికి కూడా బలవంతంగా నిద్రమాత్రలు మింగించింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు యత్నించగా... స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మహేష్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలా భర్తపై అనుమానంతో భార్య చేసిన పని.. ఇప్పుడు ముగ్గురినీ ఆస్పత్రి పాలుజేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa