ప్రధాని మోదీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటన కి వచ్చేముందు తను గంతో ఇక్కడ ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరుపై ఆత్మవిమర్శ చేసుకొని రావాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామినేని సూచించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు తరలించమని, ఈ రాష్ట్రం కోసం ఎంతో చేశామని, వంద శాతం విభజన హామీలు పూర్తి చేసామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం. విభజన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సైద్దాంతిక విలువలను పక్కనపెట్టి టీడీపీ-కాంగ్రెస్ జతకట్టాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పు పడుతూ. . టీడీపీ ఏది చేసినా అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని , మీరు రాష్ట్రానికి ఎంతో అండగా ఉంటానని నమ్మి గత ఎన్నికలలో మీతో జతకట్టిన విషయం తెలియనిదా అని నిలదీసారు. మోదీ నిరంకుశ పాలనను అంతం చేయాలంటే మహాకూటమి ఏర్పాటు కావాల్సిందేనని, అందుకోసం టీడీపీ ముందుండి పనిచేస్తుందని చెప్పారు. బీజేపీ హయాంలో ప్రభుత్వ సంస్థలన్ని నిర్వీర్యం అయిపోయాని, సీబీఐ, కాగ్ , ఎన్నికల కమిషన్, చివరకు ఆర్బిఐ లాంటి వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆరోపించారామె.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa