శ్రీశైలంలో మార్చి ఒకటి నుంచి 11 వరకూ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇవాళ 11 గంటలకు అధికారులు సిబ్బందితో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కర్నూలు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు చెందిన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరు కానున్నారు. శ్రీశైలం మల్లన్న భక్తులకు అదనపు క్యూలైన్లు, వసతి, మంచినీరు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఉత్సవ క్రతువులు, శౌచాలయాలు తదితర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్షించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa