ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే ప్రక్రియ, భార్యాభర్తలకు మాత్రమే ఆ అవకాశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2024, 07:23 PM

ఏపీలో గ్రామ, వార్డు సచివాల­యాల ఉద్యోగులకు ముఖ్యమైన గమనిక. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. కొద్దినెలల క్రితం పెద్దఎత్తున గ్రామ, వా­ర్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు కొనసాగాయి. రాష్ట్రంలో కొన్ని సచివాలయాల్లో ఎక్కువ మంది, మరి­కొన్ని సచివాలయాల్లో తక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అందుకే అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం 8 మంది ఉద్యో­గు­లు తప్పనిసరిగా పనిచేసేలా ప్రభు­త్వం రేషనలైజేషన్‌ ఉద్యోగుల సర్దుబా­టుకు సిద్ధమైంది.


10 రోజుల క్రితమే ఇందుకు సంబంధించి ప్రభుత్వం విధివిధానాలతో కూడిన ఉత్త­ర్వు­లు జారీ చేయగా.. జిల్లాలో సర్దుబా­టు ప్రక్రియకు సంబంధించిన తేదీల వారీ­గా షెడ్యూల్‌­ను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఖరారు చేసింది. ఈ మేరకు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ ధ్యాన్‌చంద్ర మెమో ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం (ఈ నెల 22) కల్లా జిల్లాల వారీగా 8 మంది కన్నా తక్కువ మంది పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు.. 8 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తున్న సచివాలయాల వివరాలతో అధికారులు నివేదికలు రూపొందిస్తారు. ఈ నెల 24కు 8మంది కంటే తక్కువ ఉద్యోగులు పనిచేస్తున్న సచివాలయాల్లో ఏ కేటగి రి ఉద్యోగ స్థానాలు ఖాళీగా ఉన్నాయో గుర్తిస్తారు.


సచివాలయాల్లో ఆ పోస్టుల భర్తీకి ఇప్పటికే సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్‌ ప్రక్రియ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న సచివాలయాల నుంచి సర్దుబాటుకు ఎవరెవరిని ఒకచోట నుంచి మరోచోటకు బదలాయించే ఉద్యోగుల జిల్లాల వారీగా జాబితాను సిద్ధం చేస్తారు. ప్రతి సచివాలయంలో కనీసం 8 మంది పనిచేసే అవకాశం ఉన్నంతవరకు అవసరమైన ఉద్యోగులకు పరిమితే ఆయా జాబితాను జిల్లా అధికారులు సిద్ధం చేస్తారు.


ఈ నెల 27, 28, 29 తేదీల్లో సర్దుబాటు ప్రక్రియ కోసం జిల్లాల వారీగా ఎంపిక చేసిన ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహించి, సర్దుబాటు ప్రక్రియలో పేర్కొన్న ఖాళీల ప్రకారం ఆ ఉద్యోగులకు నచ్చిన సచివాలయానికి బదలాయించే ప్రక్రియ చేపడతారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 15,004 గ్రామ, వా ర్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉ­ద్యోగులు పనిచేస్తుండగా.. ఈ సర్దుబాటు ప్రక్రియ­లో సుమారు 5 వేల మంది ఉద్యోగులు స్థానచల­నం ఉంటుందని గ్రామ వార్డు సచివా­లయాల శాఖ అంచనా వేస్తోంది.


ఈ సర్దుబాటు ప్రక్రియ చేపట్టే సమయంలోనే.. ఎక్కడైనా భార్యభర్తలు వేర్వేరు సచివాలయా ల్లో పనిచేస్తుంటే.. వారి అభ్యర్ధన మేరకు ఇరువురు ఒకేచోట బదిలీకి అవకాశం కల్పిస్తారు. కేవలం భార్యభర్తల కోటాకే పరిమితమై కొనసాగే ఈ బదిలీలు జిల్లా పరిధిలో అంతర్గతంగానూ, అదే సమయంలో ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు అవ కాశం కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa