ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంపేస్తానని బెదిరించి మనవరాలిపై తాత అఘాయిత్యం.. గర్భవతిని చేసి పరారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2024, 07:43 PM

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో ఆమానుష ఘటన వెలుగుచూసింది. ప్రేమగా, అపురూపంగా చూసుకోవాల్సిన మనవరాలి పట్ల ఆమె తాత అమానుషంగా వ్యవహరించాడు. బెదిరిస్తూ లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన తాజాగా బయటపడింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆ మైనర్ బాలికను ఆస్పత్రికి తరలించగా.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు నాలుగు నెలల గర్భిణిగా తేల్చారు. దీంతో మైనర్ బాలికను ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది.


అవనిగడ్డ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మోపిదేవిలోని దళితవాడకు చెందిన 14 ఏళ్ల మైనర్ బాలిక స్థానికంగా ఉన్న పాఠశాలలో తొమ్మదో తరగతి చదువుతోంది. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ హషారుగా ఉండే ఆ బాలిక ఇటీవల కొంతకాలంగా నిరాశగా, నీరసంగా కనిపిస్తూ వచ్చింది. అయితే చదువు ఒత్తిడిలో అనుకుని ఆమె తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే బాలికకు తీవ్రమైన కడుపునొప్పి రావటంతో ఆమె తల్లిదండ్రులు అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో బాలికను పరీక్షించిన వైద్యులు నాలుగు నెలల గర్భంతో ఉన్నట్లు గుర్తించారు. దీనిపై బాలికను ప్రశ్నించడంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది.


ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాత తనపై అత్యాచారం చేసినట్లు చెప్పుకొచ్చింది. ఎవరికైనా చెప్తే చంపేస్తానని, బెదిరిస్తూ పలుమార్లు తనపై అత్యాచారం చేసినట్లు బాధిత బాలిక వాపోయింది. దీంతో మైనర్ బాలిక తల్లిదండ్రులు అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తమ కూతురిపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాలంటూ ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మైనర్ బాలికకు మెరుగైన చికిత్స అందించేందుకు మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అవనిగడ్డ డీఎస్పీ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa