నిన్నటి జనసేన, టీడీపీ సభతో వైసీపీ ఓటమి పూర్తిగా ఖరారైందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. జనసందోహం చూసి వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందన్నారు. వచ్చే ఎన్నికలలో బటన్ నొక్కడం.. జగన్ ను సాగనంపడం ఖాయమన్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలో కూడా 40 సీట్లు కూడా రావని జగన్కు నివేదిక అందిందని పోతిన మహేష్ అన్నారు. జనసేన, టీడీపీ పొత్తుతో 25 ఎంపీ, 150 సీట్లు ఎమ్మెల్యే గెలుస్తామని పేర్కొన్నారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో రద్దు చేసిన వంద పథకాలను తాను చెబుతానని.. కాదని చెప్పగలరా? అని ప్రశ్నించారు. జగన్ ఇచ్చిన పథకాల వల్ల ఒక్క పేదవాడైనా ధనికుడు అయినట్లు దమ్ముంటే చూపించాలన్నారు. ఈ విషయంలో సజ్జల, మంత్రులు ఎవరైనా సవాల్ స్వీకరించి చర్చకు రావాలని పోతిన మహేష్ అన్నారు. పవన్ కళ్యాణ్పై పదే పదే విష ప్రచారం చేసే వారిని ఈసారి తొక్కేస్తామని... ఇక ఊరుకునేది లేదన్నారు. పిచ్చి పిచ్చి ప్రచారం చేస్తే... జెండా కర్ర వెనక్కి తిప్పి మరీ తరిమి కొడతామన్నారు. జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోతో వైసీపీ తట్టాబుట్టా సర్దుకుని ప్యాకప్ అయిపోవడం ఖాయమని పోతిన మహేష్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa