ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీకి మంత్రి రాజీనామా.. టీడీపీలో చేరిక, అక్కడి నుంచే పోటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2024, 07:27 PM

వైఎస్సార్‌సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.. తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇవాళ మంగళగిరిలో టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జయహో బీసీ’ సభలో పసుపు కండువా కప్పుకోనున్నారు. సీఎం జగన్‌ విధానాలతో విసుగుచెందానని గుమ్మనూరు విమర్శించారు.


తనను కర్నూలు ఎంపీగా పోటీ చేయమన్నారని.. కానీ తనకు ఇష్టం లేదన్నారు. సాయంత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతానని జయరాం ప్రకటించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి పోటీ చేస్తానని తెలిపారు. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారు. గుడిలో శిల్పం మాదిరిగా జగన్‌ తయారయ్యారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి చెప్పిందే ఆయన చేస్తున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa