తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభ్యర్థి కోసం వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జిని తమ పార్టీలోకి తీసుకువెళ్లేందుకు రంగంలోకి దిగింది. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంతో వైసీపీ కన్ను బాబ్జిపై పడింది. పార్టీలో చేరితే ఎన్నికలకు అవసరమైన ఆర్థిక సహకారంతోపాటు టిక్కెట్ ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కీలక నాయకుడు బాబ్జితో సంప్రదించారు. కాని వైసీపీ ఆఫర్ను బాబ్జి తిరస్కరించారు. చంద్రబాబు వెంటే తన పయనమంటూ స్పష్టంచేశారు. సీఎం జగన్ ముఖ్య అనుచరుడు సంప్రదించినా బాబ్జి ససేమిరా అన్నా రు. కేడర్ చెక్కు చెదరకుండా టీడీపీ అధి నాయకత్వం బాబ్జికి దిశా నిర్దేశం చేసింది. అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి పనిచేద్దామంటూ బాబ్జి కేడర్కు హితబోధ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa