వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి ఓటు వేయాలని వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఐదేళ్లలో వినుకొండ నియోజవకవర్గాన్ని అభివృద్ధిబాట పట్టించాను... మరింతగా వినుకొండను అభివృద్ధి చేసుకొనేందుకు మరోమారు తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు అభివృద్ధికి ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. శనివారం పట్టణంలోని గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో తొలుత ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 28వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. వినుకొండ ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా గత ఐదేళ్ళు పనిచేశానని, పట్టణంలోని ఎన్ఎస్పి కెనాల్ రోడ్డు నిర్మాణం, స్టేడియం నిర్మాణం, కొండపై ఘాట్ రోడ్డు, సింగర చెరువు అభివృద్ధి, తాగునీటి పైప్ లైన్ ఏర్పాటు, నూతన పాఠశాల భవన నిర్మాణాలు వంటివి చేపట్టి వినుకొండను అభివృద్ధి బాట పట్టించానని, రానున్న రోజుల్లో వినుకొండను మరింతగా అభివృద్ధి చేసుకోవాలంటే మరోమారు తనకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల నాటికి కేవలం తాను వైయస్ఆర్ సీపీ నాయకుడిగా బరిలో నిలిచానని, ప్రత్యర్థుల వైఫల్యం వలన నేను అభివృద్ధి చేస్తాను అనే నమ్మకంతో తనకు 29వేల మెజార్టీ వచ్చిందని, అయితే 2024 ఎన్నికల నాటికి తాను ఎమ్మెల్యేగా వినుకొండను అభివృద్ధి చేసి ఎన్నికలకు వెళుతున్నానని, ఈ ఎన్నికల్లో 40వేల ఓట్లు మెజార్టీ వస్తుందని, ఆ దిశగా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ప్రతిపక్షాలు పొత్తులు, ప్యాకేజీలు, కేంద్ర ప్రభుత్వ అండదండలను నమ్ముకుంటే వైయస్ఆర్సీపీ కేవలం దేవుడిని, ప్రజలను మాత్రమే నమ్ముకుందని తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా అనీల్ కుమార్ యాదవ్కు ఉంటాయని, ఇరువురికీ ఫ్యాను గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa