ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయనకి వీరితో సంబంధాలు ఉండటం నిజం కాదా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 03:27 PM

విశాఖ డ్రగ్స్‌ విషయంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నార‌ని మాదిగ కార్పొరేష‌న్ చైర్మ‌న్ కొమ్మూరి క‌న‌క‌రావు మండిప‌డ్డారు. విశాఖ డ్రగ్స్ వ్య‌వ‌హారం సీఎం వైయ‌స్ జగన్‌కు ఆపాదించడం బోడుగుండికి బొటినవేలుకి ముడివేసిన సందంగా టీడీపీ తీరు ఉంద‌ని కొమ్మూరి కనకారావు విమ‌ర్శించారు. నిన్న విశాఖ పట్నం లో భారీఎత్తున దొరికిన డ్రగ్స్ కేసులో సంధ్యా ఆక్వా కంపెనీ కి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని  కనకారావు స్ప‌ష్టం చేశారు. సంధ్యా ఆక్వా కంపెనీ ఎండీ కూనం వీరభద్రావు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఆర్ధికంగా సహాయం చేస్తూ ఉండే వ్యక్తి అని, కేవలం ఈదుమూడి గ్రామంలో తన కుటుంబం ఆదిపత్యం కోసం కూనం పూర్ణచంద్రరావు, వీరభద్ర రావు క‌లిసి పని చేయడం , వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కి వినాచనకారిగా మారిన తీరుపట్ల పట్ల అదే గ్రామానికి చెందిన ఎస్సీ, బిసీలు ఎదురు తిరిగి మ‌హానేత వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి  విగ్రహం ఏర్పాటు చేసిన విషయాన్ని క‌న‌క‌రావు గుర్తు చేశారు. సంధ్యా ఆక్వా కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు కి టీడీపీ కి చెందిన దామచర్ల జనార్ధన్ రావు, సత్యకు, ఘంటా శ్రీనివాసరావు కి సంబంధం లేదా? అని ప్ర‌శ్నించారు. ఎన్నికల్లో వీరికి ధన సహాయం చేస్తుంది వాస్తవం కాదా? అని క‌న‌క‌రావు నిల‌దీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa