ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాన రహదారిపైకి గజరాజులు గుంపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 10:59 AM

పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం గిజబ ప్రధాన రహదారిపైకి గజరాజులు గుంపుగా వచ్చాయి. కొద్ది రోజుల కిందట కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలసల్లో సంచరించిన ఏనుగుల గుంపు బుధవారం రహదారిపైకి రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. ఏనుగులు వెళ్లేంత వరకు నిరీక్షించారు. ట్రాకర్స్‌ వచ్చి ఏనుగులను దిగువ ప్రాంతాలకు మళ్లించారు. దీంతో వాహనాల రాకపోకలు కొనసాగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa