ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగరిలో అరాచకం రాజ్యమేలుతోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 11:05 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. నగరి ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజాపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జబర్దస్త్ ఎమ్మెల్యే రోజా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని మండిపడ్డారు. మున్సిపాలిటీలో పదవి ఇస్తామని రూ.40 లక్షలు తీసుకున్నారని చంద్రబాబు  ఆరోపించారు. నగరి నియోజకవర్గంలో అడుగడుగునా అరాచకం రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దోపిడికి అడ్డూ అదుపు లేదన్నారు. చివరికీ మట్టిని కూడా వదలడం లేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa