ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎన్టీఏ కూటమి త్వరలో విడుదల చేయనున్న ప్రజా మేని ఫెస్టో కోసం ప్రజల నుండి అభ్రియాలను సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. దానికోసం వాట్సాప్ నంబర్ (8341130393 ) ను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మేని ఫెస్టో కమిటీ సభ్యులు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్, జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు లంకా దినకర్లు విడుదల చేశారు.
రాక్షస పాలను అంతం చేయడమే కూటమి లక్ష్యమన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసింది జగన్ను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకేనన్నారు వర్ల రామయ్య. ప్రజా పాలనకోసం కోసం కూటమి ఏర్పడిందన్నారు.కూటమికి ప్రజా మద్దతు పెద్దఎత్తున ఉందని... కూటిమి సభలకు తండోపతండాలుగా వస్తున్న జనమే నిదర్శనమన్నారు. కూటమి మేనిఫేస్టో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే మేనిఫెస్టోగా ఉంటుందన్నారు. చంద్రబాబు ఆదేశం ప్రకారం ప్రజా అభిప్రాయం కోసం వాట్సాప్ నెంబర్ ను 8341130393 ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు వారి అభి ప్రాయాలు తెలియజేస్తే.. వారి అభిప్రాయాలను గౌరవంగా స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రాధాన్యత అభిప్రాయాలను మేని ఫెస్టోలో పొందుపరుస్తామని తెలిపారు.కూటమి విజయంకోసం, రాక్షసున్నితరిమి కొట్టేందుకు ప్రజలు తమ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.రాక్షస పాలనను అరికట్టేందుకు కూటమి చేస్తున్న మహా యజ్ఞంలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని వర్ల రామయ్య కోరారు.
రాష్ట్ర భవిష్యత్ కోసం కూటమి ఏర్పడిందని... రాష్ట్ర ప్రయోజనాలకోసం కూటమి నేతలు పనిచేస్తున్నారన్నారు జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావు. అందుకే ప్రజా శ్రేయస్సుకోసం ప్రజా మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు తెలిపారు. దాని కోసం ప్రజలను నుండి అభిప్రాయాలను సేకరించేందుకు వాట్సప్ నెంబర్ ను షేర్ చేస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపి ప్రజా మేని ఫెస్టోలో భాగస్వామ్యం కావాలని కోరారు.
ప్రభుత్వ ఫలాలు చిట్టచివరి వ్యక్తికి అందించడమే కూటమి లక్ష్యమన్నారు బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్. వికసిత్ భారత్ సుసాధ్యం అయ్యేది వికసిత్ ఆంధ్రప్రదేశ్ తోనేనని తెలిపారు. దుర్యోదన, నరకాసురుడి లాంటి జగన్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యమని పేర్కొన్నారు.ప్రజల సంక్షేమం కోసమే ప్రజా మేని ఫెస్టోను తయారు చేస్తున్నామని తెలియజేశారు. విద్రోహ పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు ఏకం కావాలని కోరారు. రాక్షస సంహారం కోసం త్రిమూర్తులుగా కూటమి జనం ముందుకు వస్తుందని తెలిపారు. ప్రజా మేని ఫెస్టోకోసం, ప్రజల నుండి అభిప్రయాలను సేకరించేందుకు వాట్సప్ నంబర్ను రిలీజ్ చేసినట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa