వాలంటీర్ల సేవలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని.. క్యాన్సర్ గడ్డ నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారంటూ వైయస్ఆర్సీపీ నేత, ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. వాలంటీర్లు నిస్వార్థ సేవ చేస్తున్నారని, లోకేశ్లా వాలంటీర్లు వ్యవహరించడం లేదన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... కొన్ని వేల మంది ఆడపిల్లల జీవితాలను వాలంటీర్లు నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఈ మధ్య కన్నీరు కార్చాడు. మగ వాలంటీర్లు ఆయన దృష్టిలో గోతాలు మోసేవారట. ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వాలంటీర్లు తలుపు కొడతారని కూడా చంద్రబాబు మాట్లాడాడు. వీళ్లు చాలా దుర్మార్గులు అని చంద్రబాబు తెగ బాధ పడిపోయాడు. రాజమండ్రి జైళ్లో ఉన్నప్పుడు కూడా, అర్ధరాత్రి పూట లేచి వాలంటీర్లు ఇంట్లోని ఆడపిల్లలని ఏం చేస్తున్నారో అంటూ బాధపడ్డాడట. ఆడపిల్లలంటే నాకంతటి మమకారం, ప్రేమ అంటూ చెప్పుకొస్తున్నాడు. లక్ష్మీపార్వతి నాకు తల్లిలాంటిదంటూ కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. మా అమ్మ అమ్మణ్ణమ్మ కంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తానని కూడా అన్నాడు. అలాంటి గొప్ప ఆడవాళ్లను, ఈ జగన్ గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థను పెట్టి దుర్మార్గం చేస్తారా అని చంద్రబాబు ఏడ్చాడు. ఈ మగ వాలంటీర్లు నీ కొడుకు లోకేశ్లా తాగుబోతు కాదు..తిరుగుబోతులు కాదు. నీ కొడుకులా ఆంబోతు కాదు..లోఫర్ కాదు..బేవర్స్ కాదని చెప్పాను. వాలంటీర్లు ఒక మనవడిలా, అన్నలా, బిడ్డలా ఉంటారు కానీ..నీ కొడుకులా ఓ పక్క పళ్లెం..మరో పక్క గొళ్లెం మెయింటేన్ చేయరు అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa