బీసీలతో సహా అందరికీ సామాజిక న్యాయం చేస్తోంది వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. పిడుగురాళ్ల, అయ్యప్పనగర్ బైపాస్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.... తెలుగుదేశం నాయకులు అంటున్నారు మా దగ్గర డబ్బుంది మీ దగ్గర ఏముంది అని అడుగుతున్నారు. నేను చెప్పా.. వాస్తవమే. మీ బాబుగారు అక్రమంగా సంపాదించుకున్న డబ్బు ఇచ్చాడు మీకు, కానీ మా జగన్ మోహన్ రెడ్డి గారు మాకు దమ్ము ఇచ్చాడు. 5 సంవత్సరాల క్రితం ఇంటింటికీ పోయాం, గడపగడపకు పోయాం. ఒకటే చెప్పాం ఒక్క అవకాశం జగన్ మోహన్ రెడ్డి గార్కి ఇవ్వండి ఆంధ్రరాష్ట్రం రూపురేఖలు మార్చి చూపిస్తాడని చెప్పాం. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత మనం చూస్తున్నాం పాలనా సౌలభ్యం కొరకు సచివాలయాలు, వాలంటీర్లను తీసుకొచ్చి. ఆరోజు మారుమూల గ్రామాల నుంచి ఎవరైనా సరే మండల హెడ్ క్వార్టర్ కు పోయి కుల ధృవీకరణ పత్రాలు, పట్టాలు, పెన్షన్లు గానీ హాయిగా ఈరోజు వారి గ్రామాల్లోనే సచివాలయాలు ఏర్పాటు చేసి ఎవ్వరూ మండల హెడ్ క్వార్టర్ కు పోకుండా చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు. పెన్షన్ కొరకు గంటలు గంటలు వేచి చూసేది లేకుండా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఇంటికీ పెన్షన్ వచ్చేటట్టు చేస్తోంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. కేవలం పాలనా సౌలభ్యమే కాదు, సంక్షేమం ఈరోజు నవరత్నాల ద్వారా దాదాపు 80 శాతం మంది ప్రజలకు రూ.2 లక్షల కోట్లు ప్రతి ఇంటికీ రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వచ్చేటట్టు ఈ ఐదు సంవత్సరాలలో వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేటట్టు చేయూత గానీ, ఆసరా గానీ, అమ్మఒడి గానీ విద్యాదీవెన, వసతిదీవెన, ఆరోగ్యశ్రీ, రైతుభరోసా, కరోనా అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పేదవాడు తన కాళ్ల మీద నిలబడేటట్టు చేశాడు జగన్ మోహన్ రెడ్డి అని తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa