ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చీకటి పాలనను అంతం చేసేందుకు కూటమి ఏర్పడింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 10, 2024, 10:07 PM

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  పునరుద్ఘాటించారు. ఎన్డీయే కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు తణుకులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. చీకటి పాలనను అంతం చేసేందుకు ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూటమి కోసం విశేష కృషి చేశారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని మోదీ ప్రభుత్వ సాయం అవసరమన్నారు. ప్రజాగళానికి వారాహి రూపంలో రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైందని అన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకునే తీరిక ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అబివృద్ధి కోసం ఎన్డీయే కూటమిని గెలిపించాలన్నారు. సైకిల్ స్పీడ్‌కు తిరుగులేదని, గ్లాసు జోరుకు ఎదురులేదని చంద్రబాబు నాయుడు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa