చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందు తుందని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని సి.క్యాంప్లోని ప్రభుత్వ పెన్షనర్ల జిల్లా కార్యాలయంలో విశ్రాంత ఉద్యో గులతో టీజీ భరత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన అనంతరం రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఉద్యోగుల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయ మన్నారు. ఈ ఐదేళ్లేలో రాష్ట్రం ఎంతో వెనుకబడి పోయిందన్నారు. కార్యక్ర మంలో పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, ట్రెజరర్ రాజారావ్, మాజీ అధ్యక్షుడు మద్దిలేటి రెడ్డి, రిటైర్డ్ డీఎస్పీ పాపారావు, రిటైర్టు జైళ్ల శాఖ అధికారి నాగేశ్వరరెడ్డి, రిటైర్డ్ డీఎస్పీ పక్కీరయ్య, రిటైర్టు ఆర్టీవో శ్రీధర్, ఆర్జా రామకృష్ణ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa