తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 50 ఏళ్లకే రూ.4వేలు పింఛన్ అందజేస్తామని పార్టీ నంద్యాల జిల్లా అధ్య క్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. మండలంలోని హుశేనాపురం లో జయహో బీసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీసీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈసందర్భంగా మల్లెల రాజ శేఖర్ మాట్లాడుతూ.... బీసీలకు తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం లాంటి దన్నారు. టీడీపీ బీసీల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టింద న్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేస్తామన్నారు. బీసీలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలులో వేయడమే కాకుండా, వారిని ఇబ్బందులకు గురి చేసిందన్నారు. కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు బీసీ సెల్ అధ్యక్షు డు మల్లికార్జున, టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, నాయకులు మహబూబ్ బాషా, సుధా కర్, మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాము, చంద్రపెద్దస్వామి, బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, నాగమల్లేష్, షమీనా, వెంక టరమణ, గోపాల్, మధుసూదన్గౌడు, మహేష్గౌడు, వెంకటసుబ్బయ్య, రామగోవిందు, బజారు, వేణు, జయక్రిష్ణ, రవి, నాగరాజు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa