వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఇంటా ‘నవరత్న’ వికాసం కనిపిస్తుందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. అయన మాట్లాడుతూ... కోనూరు గ్రామస్తులు వైయస్ఆర్సీపీ హయాంలో జరిగిన మేలును గుర్తుచేసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణను, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ను గెలిపించాలని కోరారు. పేదలకు వైద్యభరోసా కల్పిస్తూ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఆర్థిక పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.25లక్షలకు ప్రభుత్వం పెంచిందన్నారు. తోటపల్లి కాలువలను తవ్వించి సాగునీటి సమస్యకు తెరదించామని చెప్పారు. 58 నెలల పాలనలో ఒక్క కోనూరు గ్రామంలోని లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాల కింద రూ.15 కోట్ల నిధులు నేరుగా వారి ఖాతాల్లో జమచేసిన ఘనత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో ధీర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బొత్స సందీప్బాబు, వైస్ ఎంపీపీ జి.రామకృష్ణరాజు, సర్పంచ్ బూడి శ్రీరాముల నాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ మీసాల విశ్వేశ్వరరావు, జి.శ్రీరాములనాయుడు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa