టీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసిందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వెంకటరెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు దాడిలో చనిపోయిన మేకా వెంకటరెడ్డి మృతదేహనికి వైయస్ఆర్సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహుల్లా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజి మంత్రి రావెల కిషోర్ బాబు, అప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వెంకటరెడ్డి నివాసగృహానికి సజ్జల తో పాటు అందరూ తరలివెళ్లారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. వెంకటరెడ్డిని తిరిగి తీసుకురాలేమని, ఇలా జరగడం దారుణం అని అయితే కుటుంబసభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa