విశాఖపట్నం జిల్లా, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ ఎండాడ ఎం వీ వీ సిటీ నైట్ స్టే పాయింట్ నుంచి ప్రారంభమైంది. ఎండాడ ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురు కీలక నేతలు చేరారు. భారతీయ జనతాపార్టీ గాజువాక నియోజకవర్గం నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వి ఎస్ ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవింద్, కార్యదర్సి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి, సంపత్ కుమార్. టీడీపీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన యువజన విభాగం నేత ఏఎన్ఆర్. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి వైయస్.జగన్. కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్ధి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa