భార్యతో అసహజ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని, మారిటల్ రేప్ అనడానికి ఆస్కారం లేదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయనను వివాహం చేసుకున్నందన వైవాహిక అత్యాచారం అనేదానికి ఆస్కారం లేదని పేర్కొంది. ఈ మేరకు భర్తపై భార్య పెట్టిన అత్యాచారం కేసును కొట్టివేసింది. ‘చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యతో కలిసి భర్త అసహజ శృంగారంలో పాల్గొనడం ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం నేరం కాదు అని నిర్దారణకు వచ్చాం.... సత్యదూరమైన ఆరోపణల ఆధారంగా నమోదైన ఈ ఎఫ్ఐఆర్పై తదుపరి చర్చలు అవసరం లేదని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది’ అని మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఎస్ అహ్లూవాలియా తీర్పు చెప్పారు.
బుధవారం వెలువరించిన ఈ ఉత్తర్వులను హైకోర్టు అధికారిక వెబ్సైట్లో గురువారం అప్లోడ్ చేశారు. దేశంలో ఇప్పటి వరకూ వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేదు. భార్య ఫిర్యాదుతో భర్తపై జబల్పూర్ పోలీసులు 2022లో నమోదుచేసిన ఎఫ్ఐాఆర్ను కోర్టు కొట్టివేసింది. తనపై నమోదైన అత్యాచారం కేసును కొట్టివేయాలని కోరుతూ సదరు భర్త హైకోర్టు ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ అహ్లూవాలియా.. చట్టంలోనే ఇలాంటి అంశం లేదని పేర్కొంటూ కేసును రద్దు చేశారు.
భార్యాభర్తలు విడాకులు లేదా వేరే కారణాల వల్ల వేర్వేరుగా ఉండేటప్పుడు మాత్రమే ఐపీసీ సెక్షన్ 376బీ కింద ఇటువంటి కేసుల్లో మినహాయింపు ఉంటుందని వ్యాఖ్యానించారు. కానీ, ఈ కేసులో పెళ్లైన అత్తింటికి వచ్చిన తర్వాత తన భర్త పలు సందర్భాల్లో అసహజ శృంగారం చేశాడని పేర్కొంది. ‘ఏదేమైనప్పటికీ సెక్షన్ 375లోని 2 ప్రకారం.. భార్యాభర్తల మధ్య లైంగిక సంపర్కం లేదా లైంగిక చర్యలకు మినహాయింపు ఇస్తుంది.. భార్య వయస్సు పదిహేనేళ్లలోపు కాదు.. అది రేప్గా పరిగణించలేం...భార్య వయసు పదిహేనేళ్ల కంటే తక్కువ ఉంటే అప్పుడు అది అసంబద్ధం అవుతుంది’ అని కోర్టు పేర్కొంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa