ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన భూ వివాదాలు తగ్గుతాయి, అమ్మకాలు, కొనుగోలు సులభం అవుతుందని వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఏ పార్టీ అయినా ఎన్నికల్లో ప్రజలకు ఏం చేస్తారో మ్యానిఫెస్టో ద్వారా చెప్పి ప్రజల ముందుకు వెళ్ళాలని సూచించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.... వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.... టీడీపీ మ్యానిఫెస్టో ఏంటో ప్రజలకి చెప్పకుండా విమర్శలతో,వైయస్సార్ సిపిపై దుష్ప్రచారంతో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. మీకు,మీ కుటుంబానికి లబ్ది చేకూరింది అని భావిస్తేనే మాకు ఓటు వేయండి అని జగన్ గారు ధైర్యంగా ప్రజలను ఓట్లు అడుగుతున్నారు.తిరిగి ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేసే మేనిఫెస్టోతో రాబోయే రోజుల్లో చేసే అభివృద్ధి-సంక్షేమం చేస్తానని చెప్పి జగన్ గారు ప్రజల ముందుకు వెళ్తున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వైయస్సార్ సిపి ప్రభుత్వం తెస్తున్నది కాదు.భారత దేశంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి 60%కేసులు సివిల్ కేసులే ఉన్నాయి.ఈ నేపధ్యంలో వాటికి పరిష్కారం కనుగొనాలనే మంచి లక్ష్యంతో ఈ యాక్ట్ ను రూపొందించారు. 2008 నుండి ఈ యాక్ట్ మీద అధ్యయనం జరుగుతోంది. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక యాక్ట్ కు సంబంధించి నీతి అయోగ్ అమలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని పలు సూచనలు,సలహాలు చేసింది.ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను టీడీపీ అసెంబ్లీ లో మధ్దతు తెలిపింది.తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సూచనలతో పయ్యావుల కేశవ్ మద్దతుగా మాట్లాడారు. రాష్ట్రపతి ఆమోదం కూడా జరిగింది. ముందు సమగ్ర భూ సర్వే చేయడం ఈ యాక్ట్ లో ముఖ్యమైన అంశం.ఇప్పుడు వరకు బ్రిటీష్ కాలంనాటి పాత పద్ధతిలో గొలుసులతో సర్వే జరుగుతుంది. వైయస్సార్ సిపి అధికారంలోకి వచ్చాక 10 వేల మంది సర్వే సిబ్బందిని పెట్టి లేటెస్ట్ టెక్నాలజీతో 6 వేల గ్రామాలలో సర్వే పూర్తి చేసాం. కొంతమంది హైకోర్ట్ లో పిటిషన్ వేస్తే మేము క్లారిటీగా చెప్పాం. ఈ యాక్ట్ ఇంకా అమలులో లేదని.రాష్ర్టంలో 17 వేల గ్రామాలకు గాను 6 వేల గ్రామాలలోనే సర్వే పూర్తి అయింది.అంతా పూర్తి అయిన తర్వాతనే అమలులోకి వస్తుంది స్పష్టంగా చెప్పాం.సర్వే,ప్రజలనుంచి అభ్యంతరాల స్వీకరణ,మార్పులు చేసి అమలు చేయడానికి సమయం పడుతుంది.కొంతమంది రిటైర్డ్ అధికారులతో అసత్యాలతో కూడిన తప్పుడు ప్రచారం తెలుగుదేశం పార్టీ చేస్తుంది.చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రజలను భయభ్రాంతులను చేసేవిధంగా ప్రసంగాలు చేస్తున్నారు.వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే భూములు కబ్జాచేస్తారని, లాక్కుంటారని దినపత్రికలలో సైతం పెద్ద పెద్ద యాడ్స్ వేసి ప్రజలను భయపెడుతున్నారు.ప్రజలలో అయోమయం సృష్టిస్తున్నారు. ప్రజలకు ఒరిజనల్ పత్రాలు ఇవ్వరని కేవలం జిరాక్స్ డాక్యుమెంట్స్ ఇస్తారని, భూములు అమ్ముకుంటారని అబద్దాలు చెబుతున్నారు.వైయస్ జగన్ గారు భూములు లాక్కుంటున్నారని విషప్రచారం చేస్తున్న చంద్రబాబు అలా ఎన్ని భూములు లాక్కున్నారో ప్రజలకు చెప్పాలి.ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన భూ వివాదాలు తగ్గుతాయి,అమ్మకాలు,కొనుగోలు సులభం అవుతుంది. రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 124 చట్టాలు ఉన్నాయి వాటన్నిటికంటే ఈ ఒక్క యాక్ట్ వల్ల భూహక్కు దారులకు మేలైన ప్రయోజనాలు కలుగుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa