ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చేయడంలో ఈసీ కూడా సైoధవ పాత్ర పోషిస్తోందని వైయస్ఆర్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.... ఐదేళ్లుగా పేదలు,మహిళలను అభివృధ్దిలోకి తీసుకువచ్చేందుకు వైయస్ జగన్ అనేక సంక్షేమ పధకాలు తీసుకువచ్చారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు వాటిని అడ్డుకోవాలని కుట్రపన్నారు. తెలుగుదేశం పార్టీ కుటిల ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల ఖాతాల్లో జమచేయాల్సిన నిధులను ఎన్నికల కోడ్ రావడంతో గత నెల నుంచి ఎన్నికల సంఘం అనుమతిని ప్రభుత్వం కోరింది. ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంలో జాప్యం రావడంతో పోలింగ్ తేదీ దగ్గరకు చేరుకుంది. గత నెలలోనే అనుమతులు ఇచ్చి ఉంటే నిధులు లబ్దిదారులకు చేరి ఉండేవి.అయినా ఇవి నూతనంగా చంద్రబాబులా ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టిన పధకాలు కావు. జగన్ గారు పేదల ఉన్నతికోసం,మహిళల ఉన్నతికోసం,విద్యార్దుల ఫీజు రీయంబర్స్ కోసం చిత్తశుధ్దితో అమలు చేస్తున్న పధకాలు. అదే విధంగా నిధులు అకౌంట్లలో పడక పోవడంతో లక్షలాదిమంది రైతుల కు అందాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ నిలిచిపోయింది. ఇన్ పుట్ సబ్సిడి ఇవ్వండి అని రైతులు అడుగుతున్నా కూడా ఎక్కడా స్పందన కనిపించడం లేదు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఫీజ్ రీయంబర్స్ మెంట్ లేక అల్లాడుతున్నారు. వాలంటీర్ల తో పెన్షన్ ఇవ్వకుండా ఉసురు తీసుకున్నారు. అసలు చంద్రబాబు ప్రజలపై ఇంత కక్ష కట్టి వ్యవహరిస్తున్నారు. వ్యవస్ధలను మేనేజ్ చేయడంలో ఆరితేరిన చంద్రబాబు వ్యవహారం అందిరికి తెలుసు. ఎన్నికల కమీషన్ పై ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నాడు. హైకోర్ట్ అనుమతి ఇచ్చినా కూడా పధకాల అమలుకు ముందుకు వెళ్ళడానికి వీలు లేదని ఈసీ చెబుతోందని వాసిరెడ్డి పద్మ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa