ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనాలు క్యూ కట్టారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఓటు వేయాల్సిందే అంటూ చాలామంది ముందుగానే ఏపీకి చేరుకుంటున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబైతో పాటుగా విదేశాల నుంచి కూడా చాలామంది సొంత రాష్ట్రంలో ఓటు కోసం వస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ ఎయిర్పోర్టులో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. రెండు రోజులుగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నుంచి వచ్చే విమానాలు రద్దీగా ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
గన్నవరం ఎయిర్పోర్టుకు ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందినవారు ఎక్కువగా వస్తున్నారు. వీరిలో కొందరు విదేశాల నుంచి బయల్దేరి ఢిల్లీ, హైదరాబాద్లో దిగి.. అక్కడి నుంచి విజయవాడకు వస్తున్నారు. అక్కడి నుంచి గన్నవరం వస్తున్నారు. శుక్రవారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు.. ఎన్ఆర్ఐలు కూడా తరలి వచ్చారు. ఈసారి ఎన్నికల్లో ఓటు వేయాల్సిందే అనే పట్టుదల వీరిలో కనిపిస్తోంది. మరోవైపు శని, ఆదివారాలు సెలవు కావడంతో శుక్రవారం రాత్రి నుంచి పలువురు ఏపీకి వెళుతున్నారు. రెండు రోజులు సొంత ఊళ్లలో ఉండి.. సోమవారం ఓటు వేయడానికి ముందు వెళ్లారు. అంతేకాదు హైదరాబాద్ విజయవాడ రూట్లో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. శని, ఆదివారాలు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఏపీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. ఆ తర్వాత ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించకూడదని ఈసీ తెలిపింది.. ఒకవేళ ఎవరైనా ప్రచారం నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తారు. సోమవారం పోలింగ్ జరగనుంది.. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. అంతేకాదు ప్రచార సమయం ముగిసిన తర్వాత స్థానికేతరులు ఆయా నియోజకవర్గాలను వదిలి వెళ్లిపోవాల్సిందే. అంతేకాదు ఈ 48 గంటలు బల్క్ మెసేజ్లు కూడా పంపడానికి వీల్లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa