ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకినాడను కాపాడాల్సిన బాధ్యత మనదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 12:55 AM

ఇదే స్థలంలో చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌లను గతంలో ద్వారంపూడి మాట్లాడకూడని మాటలు మాట్లాడానని, ఇదే కాకినాడ , బాలాజీచెరువు సెంటర్‌లో పవన్‌కల్యాణ్‌ సభకు అనుమతి ఇవ్వడం దైవ సంకల్పమని, ఈ సభ ద్వారా ద్వారంపూడి పతనం ఇక్కడి నుంచే ఆరంభం అయ్యిందని కాకినాడ సిటీ అసెంబ్లీ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం కాకినాడ బాలాజీచెరువు సెంటర్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సభ నిర్వహించారు. ఈ సభలో తొలుత కొండబాబు మాట్లాడుతూ.....  ఈ నెల 11న కాకినాడ వస్తానని పవన్‌కల్యాణ్‌ గత నెల 18నే ప్రకటించారన్నారు. దీంతో పవన్‌కల్యాణ్‌ సభకు స్థలం లేకుండా చేయాలని కాకినాడలోని అన్ని సెంటర్లు కావా లని ద్వారంపూడి అనుమతి తెచ్చుకున్నాడన్నారు. పవన్‌ కల్యా ణ్‌ సభ అనుమతి కోసం రాత్రి 2 గంటల వరకు ఇబ్బంది పెట్టి ఎట్టకేలకు బాలాజీచెరువు సెంటర్‌లో అనుమతి ఇచ్చా రన్నారు. కాకినాడ గతంలో స్మార్ట్‌సిటీగా ఉండేదని, ఈ రోజున గంజాయి సిటీ, డ్రగ్స్‌ సిటీ, గూండాల సిటీ, రౌడీల సిటీగా అయిపోయిందన్నారు. కాకినాడను కాపాడాల్సిన బాధ్యతపై మొన్ననే చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని, ఈ రోజున పవన్‌కల్యాణ్‌ హామీతో కాకినాడ ప్రజలు సుభిక్షంగా ఉండను న్నారన్నారు. పవన్‌కల్యాణ్‌ రాక కోసం కాకినాడ ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. దత్తపుత్రుడు, దత్తపుత్రుడు అని పవన్‌కల్యాణ్‌ను చాలా మంది మాట్లాడు తున్నారని, పిఠాపురంలో ఉండే దైవం దత్తాత్రేయుడే అక్కడి నుంచి పోటీ చేసేందుకు పవన్‌కల్యాణ్‌ను రప్పించుకున్నార న్నారు. చంద్రబాబునాయుడు మద్దతు, పవన్‌కల్యాణ్‌ మద్దతు తో ఆంధ్ర రాష్ట్రంలో దుర్మార్గుడి పాలనను అంతమొందించి ఈ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించబోతున్నామని కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa