సొంత చెల్లి, తల్లికి న్యా యం చేయలేని దుర్మార్ఘుడు జగన అని, అలాంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా ఆయన శనివారం హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి నియోజకవర్గ వ్యా ప్తంగా వేల మంది తరలివచ్చారు. నంది సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. అక్కడ బాల కృష్ణ మాట్లాడుతూ... అన్న అన్యాయం చేశాడు... తాము మోసపోయామంటూ సొంత చెల్లులు ఆరోపిస్తుంటే ఈ ముఖ్యమంత్రికి చెవికెక్కలేదన్నారు. తల్లి కూడా అతడి దెబ్బకు తట్టుకోలేక మన రాష్ట్రానికి రావడం మానేసిం దన్నారు ఇలాంటి సీఎం రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తా డో గ్రహించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో పేదల భూములన్నీ వైసీపీ నాయకు ల వశం అవుతాయని, టీడీపీ అధికారంలోకి వస్తే దాన్ని రద్దుచేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు ఆలోచించి సోమవా రం ఓటు వేయాలన్నారు. ప్రపంచంలో ఏ పార్టీకి లేని విధంగా టీడీపీకి కార్యకర్తలు ఉన్నారని, వారున్నంత కా లం పార్టీ ఓ మహాశక్తిగా ఉంటుందన్నారు. నవరత్నాల పేరుతో జగన అక్క, చె ల్లెమ్మలను మోసం చేశారని, జే బ్రాండ్ మద్యంతో లక్షల మంది ప్రాణాలు పోయార న్నారు. చిలమత్తూరు మండలం వీరాపురాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనన్నారు. పురంలో మళ్లీ అన్న క్యాంటిన ఏర్పాటుచేస్తామని, ప్రభుత్వాసు పత్రి రూపురేఖలు మార్చుతామని హామీ ఇచ్చారు. ఈ ర్యాలీలో నందమూరి వసుంధరాదేవి, టీడీపీ, బీజేపీ, జనసేన, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa