ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి మూడోసారి లోక్సభకు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. మంగళవారం కాశీలోని గంగానదికి పూజలు నిర్వహించిన మోదీ.. నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. అస్సీఘాట్లో ప్రత్యేక పూజలు చేసి... దశ అశ్వమేథ ఘాట్ వద్ద గంగామాతకు ప్రత్యేక హారతి ఇచ్చారు. వేద పండితులు ప్రత్యేక మంత్రోచ్చరణ మధ్య గంగమ్మకు చీరసారే సమర్పించి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం కాల భైరవ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి నామినేషన్ వేసేందుకు వారణాసి కలెక్టరేట్కు పయనమయ్యారు.
బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. ఇది సుమారు నాలుగు గంటలపాటు సాగనుంది. మోదీ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ ముఖ్యమంత్రులతో పాటు మిత్రపక్షాల సీఎంలు హాజరవయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్,
బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ, హరియాణా సీఎం నయాబ్ సింగ్ సైనీలతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు వారణాసికి చేరుకున్నారు.
ప్రత్యేక విమానంలో వారణాసికి చేరుకున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నామినేషన్ అనంతరం జరిగే ఎన్డీఏ భేటీలో పాల్గొంటారు. పవన్ సోమవారం రాత్రే వారణాసికి చేరుకోగా చంద్రబాబు మంగళవారం ఉదయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏఎన్ఐతో మాట్లాడుతూ.. వారణాసి పవిత్రమైన స్థలమని, మోదీ మూడోసారి ప్రధాన మంత్రి కాబోతున్నారని అన్నారు. గత 10 ఏళ్లలో మోదీ పనితీరు చాలా బాగుందని, ఆయన దేశానికి అవసరమని చెప్పారు. ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని చంద్రబాబు తెలిపారు.
వారణాసి కలెక్టర్ కార్యాలయంలో ప్రధాని నామినేషన్ పత్రాలను సమర్పించారు. మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్తో పాటు ఆయనను బలపరిచే నలుగురు ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం.. అక్కడ ప్రధాని ప్రమాణస్వీకారం చేశారు. అయోధ్య రామాలయం పూజారి, ఓ దళితుడు, ఇద్దరు ఓబీసీలు ప్రధాని మోదీ నామినేషన్ను ప్రతిపాదించినవారిలో ఉన్నారు. నామినేషన్ దాఖలు అనంతరం.. బీజేపీ, మితపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ కూటమిలోని పార్టీల ముఖ్య నేతలతో కలిసి వారణాసిలో జరిగిన రోడ్డు షోలో మోదీ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa