ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నా , కూటమి నా ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 16, 2024, 08:30 PM

రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. సరికొత్త రికార్డు సృష్టించారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల పోలింగ్‌ ప్రక్రియలో ఏపీ టాప్‌లో నిలిచింది. సోమవారం జరిగిన పోలింగ్‌లో మొత్తంగా 81.86 శాతం ఓట్లు పోలైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనిలో ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 1.2 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపింది. 2019 ఎన్నికలతో పోల్చితే ఈసారి 1.98 శాతం పోలింగ్‌ పెరగడం గమనార్హం. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా బుధవారం ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో 4,13,33,702 మంది ఓటర్లు ఉండగా వారిలో 3,33,40,560 మంది ఓటర్లు తాజా ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎంల ద్వారా ఓటేసిన వారిలో పురుషులు 1,64,30,359 మంది ఉండగా, మహిళలు 1,69,08,684 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 1,517 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 25 పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా చూస్తే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం పోలైన ఓట్ల కన్నా 227 మంది ఓటర్లు పార్లమెంటుకు అధికంగా ఓటు హక్కు వినియోగించున్నారు. 2019 ఎన్నికల్లో 3.07 కోట్ల ఓటు వేయగా.. ఈసారి 26 లక్షల మంది అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో మొత్తం ఓటేసిన వారి సంఖ్య 3,33,40,560కు చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa