ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఏడాది వర్షాలు ఎప్పుడంటే ..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 16, 2024, 08:38 PM

అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకుతాయని బుధవారం ప్రకటించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 కేరళకు వస్తాయి. అయితే ఈ ఏడాది ఒకరోజు ముందుగా రానున్నాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్రా తెలిపారు. గతనెలలో ఇచ్చిన నివేదిక ప్రకారం నైరుతి సీజన్‌లో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 4నెలల నైరుతి సీజన్‌లో జూన్‌, జూలై నెలలు అత్యంత కీలకం. ఈ నెలల్లోనే ఖరీఫ్‌ సాగు ఎక్కువగా సాగుతుంది. ఈ రెండు నెలల్లో వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని మహాపాత్రో వివరించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో సాధారణానికి మించి వర్షా లు కురుస్తాయని కేంద్రం ప్రకటించింది. 50ఏళ్ల సగటును పరిగణనలోకి తీసుకుంటే రుతుపవనాల సీజన్‌లో సగటున 87 సెం.మీ. వర్షపాతం నమోదవుతుందని, దీనికి అనుగుణంగా ఈ ఏడాది సాధారణానికి మించి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. కాగా, ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజులు వివిధ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa