ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసీకి లేఖ వ్రాసిన ఏబీ వెంకటేశ్వరరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2024, 01:56 PM

కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌(క్యాట్‌) తీర్పును అనుసరించి తనకు పోస్టింగ్‌ ఇప్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు శనివారం లేఖ రాశారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న తనకు పోస్టింగ్‌ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని, న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలోనే అందరికన్నా సీనియర్‌ ఐపీఎస్‌ అయిన తన సస్పెన్షన్‌ చెల్లదంటూ పది రోజుల క్రితమే క్యాట్‌ తీర్పు ఇచ్చిందంటూ లేఖతోపాటు ఆ కాపీని జత చేశా రు. ఈ లేఖను సీఈవో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపించారు. సీఈసీ నిర్ణయం మేరకు ఏబీవీకి పోస్టింగ్‌ లభించే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa