ఆయేషా మీరా శరీర అవశేషాలను తెనాలి చెంచుపేటలోని ఖబరస్థాన్లో నేడు ఖననం చేయనున్న నేపథ్యంలో ఈద్గా వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీబీఐ కోర్టుకు వెళ్లిన ఆయేషా తల్లిదండ్రులు అవశేషాలను తీసుకొని మధ్యాహ్నం తెనాలి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ముస్లిం మత పెద్దల సమక్షంలో శరీరాన్ని తిరిగి ఖననం చేయనున్నారు. ఆయేషా మీరాకు అంతిమ వీడ్కోలు పేరిట ప్రజా సంఘాలు చలో తెనాలికి పిలుపునిచ్చాయి.నిందితులు ఎవరో ఇప్పటికీ తెలియని ఈ కేసు లో ప్రజా సంఘాలు, లాయర్లు అయేషా మీరాకు సంఘీభావం గా ఈరోజు ర్యాలీ లకు పిలుపునిచ్చారు. విజయవాడ కోర్టు నుండి నగరం లోని డా.అంబెడ్కర్ భారీ విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించాలని లాయర్లు పిలుపు ఇచ్చారు. ఆ తరువాత అయేషా తల్లితండ్రుల వెంటే తెనాలి వరకూ వెళ్ళడానికి 'ఛలో తెనాలి ' కార్యక్రమం జరపాలని నిర్ణయించారు. అయితే దీనిపై పోలీసులు అలెర్ట్ గా ఉన్నారు. ఇటు విజయవాడ, అటు తెనాలి లో పూర్తిగా అప్రమత్తం గా ఉండడమే కాకుండా ప్రజలకు పలు సూచనలు చేశారు. దానితో ఆ రెండు చోట్లా ఒక విధమైన ఉద్వేగ పూరిత వాతావరణం నెలకొని ఉంది. పూర్తిగా సంచలనం సృష్టించిన ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాలోని ప్రజలకూ బాగా సువరిచితం కావడం తో తెలుగు ప్రజలు కూడా పరిణామాలను గమనిస్తూ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa