కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని, మోదీ డబుల్ ఇంజన్ అని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు.. డబుల్ కాదు కదా సింగిల్ ఇంజన్ కూడా వచ్చే అవకాశం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏకు 400 సీట్లు వస్తయంటూ ప్రధాని మోదీ మైండ్ గేమ్ ఆడుతున్నారని.. వాస్తవానికి పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. ఉత్తర భారత దేశంలోనూ ఎన్డీకి భారీగా సీట్లు తగ్గనున్నాయన్నారు. దక్షిణ భారతదేశంలో ఎన్డీఏకు సీట్లు వచ్చే అవకాశమే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పుణ్యమా అని ఒకటి రెండు సీట్లు రావచ్చునని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కక్షపూరితంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. సీపీఐ నేత ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో ఎన్నికల ముందు.. ఎన్నికల అనంతరం గొడవలు, దాడులు జరగడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే పిన్నెల్లి, కాసు రాజకీయ కక్షలను బయటకు తీసి దాడులు జరిగేందుకు ఆజ్యం పోశారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న డీజీపీ ఉత్సవ విగ్రహంలా ఉన్నారని.. సీఎస్ను ఎప్పుడో మార్చాల్సిందని అన్నారు. రాబోయే ప్రజా తీర్పులో కమ్యూనిస్టుల పాత్ర గణనీయంగా ఉంటుందని ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa