ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్, మోడీ ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2024, 02:13 PM

ప్రజాస్వామ్య దేశంలో అద్భుతాలు జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో వైసీపీ రూ. 4 వేల నుంచి రూ. 5 వేల కోట్ల డబ్బు ఖర్చు పెట్టిందని, ఇన్ని కోట్ల డబ్బులు వైసీపీకి ఎక్కడ నుంచి వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థి రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారని, గూడూరు వైసీపీ అభ్యర్థి రూ. 45 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. వైసీపీకి పోలీసులు అండగా నిలిచారని ఆరోపించారు. పోలీసులు దొంగలను పట్టుకోవాలి కానీ వాళ్లే దొంగలకి సహాయం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. వైసీపీ నేతలు తామే అధికారంలోకి వస్తున్నామని ధైర్యంగా చెబుతున్నారని, అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని చింతా మోహన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి  ఓడిపోవడం ఖాయమన్నారు. నరేంద్రమోదీ పతనం ప్రారంభమైందని.. బీజేపీకి 150 కంటే ఎక్కువ సీట్లు రావని జోష్యం చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు కేంద్ర మంత్రులు అనే చర్చ కూడా ప్రారంభమైందని, జగన్మోహన్ రెడ్డికి పడాల్సిన ఓట్లన్నీ చంద్రబాబు నాయుడుకు పడ్డాయన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని చింతా మోహన్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa